News August 19, 2024
NLG: రెండేళ్లుగా నిర్వహణకు నిధులు లేవు!

జిల్లాలో రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ను ఏర్పాటు చేసి ఒక్కోదానికి రూ.22 లక్షలు ఖర్చుచేసి జిల్లా వ్యాప్తంగా మొత్తం 140 రైతు వేదికలు నిర్మించారు. వారం వారంవ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణలు ఇస్తూ సీజన్ లో పంటల వారీగా సాగులో మెలకువలను తెలియజేయాలనేది వీటి లక్ష్యం. కాగా 24 నెలలుగా రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు
Similar News
News December 21, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

NLG: 23న కేటీఆర్ రాక.. ఏర్పాట్ల పరిశీలన
NLG: ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
మిర్యాలగూడలో నకిలీ వైద్యుల గుట్టురట్టు
నల్గొండలో ప్రమాదకరంగా మ్యాన్ హోల్
చిట్యాల: ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి?
నల్గొండ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
కట్టంగూరు హస్తంలో లుకలుకలు
నిడమనూరు: ఆ 5 గ్రామాల పల్లె పగ్గాలు యువత చేతికి
నల్గొండ: త్వరలో సహకార ఎన్నికలు
News December 20, 2025
సోమవారం యథావిధిగా ‘ప్రజావాణి’: నల్గొండ కలెక్టర్

ఎన్నికల కోడ్ ముగియడంతో జిల్లాలో నిలిచిపోయిన ‘ప్రజావాణి’ కార్యక్రమం తిరిగి ఈ సోమవారం నుంచి యథావిధిగా అర్జీలను స్వీకరించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం విదితమే. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి బాధితులు తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని ఆమె తెలిపారు.
News December 20, 2025
మీ డబ్బు.. మీ సొంతం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ జిల్లాలోని బ్యాంకుల్లో సుమారు రూ.66 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఉదయాదిత్య భవన్లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నామినీ వివరాలు లేకపోవడం, కేవైసీ అప్డేట్ చేయకపోవడం వల్ల ఈ నిధులు నిలిచిపోయాయని వివరించారు. ఖాతాదారులు వెంటనే తమ బ్యాంకు వివరాలు సరిచూసుకుని, నిబంధనల ప్రకారం సొంత నిధులను క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు.


