News August 19, 2024

NLG: రెండేళ్లుగా నిర్వహణకు నిధులు లేవు!

image

జిల్లాలో రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ను ఏర్పాటు చేసి ఒక్కోదానికి రూ.22 లక్షలు ఖర్చుచేసి జిల్లా వ్యాప్తంగా మొత్తం 140 రైతు వేదికలు నిర్మించారు. వారం వారంవ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణలు ఇస్తూ సీజన్ లో పంటల వారీగా సాగులో మెలకువలను తెలియజేయాలనేది వీటి లక్ష్యం. కాగా 24 నెలలుగా రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు

Similar News

News December 21, 2025

ఎలక్షన్ ఎఫెక్ట్.. మంద కొడిగానే బియ్యం పంపిణీ..!

image

జిల్లాలో రేషన్ బియ్యం విక్రయాలు డిసెంబర్ మాసంలో మందకొడిగా సాగాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ప్రభావం ప్రజా పంపిణీ కేంద్రాలపై పడింది. పల్లె పోరులో చాలా బిజీగా ఉన్న లబ్ధిదారులు రేషన్ దుకాణాల వంక చూడకపోవడంతో ఆయా దుకాణాలలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. 23 మండలాల్లో బియ్యం పంపిణీ 35 శాతానికి మించలేదు. దీంతో మరో రెండు మూడు రోజులపాటు సరఫరా చేయనున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.

News December 21, 2025

NLG: బిల్లులు వచ్చేనా.. ఇక్కట్లు తొలిగేనా?!

image

రెండేళ్ల నుంచి గ్రామపంచాయతీలలో బిల్లులు పెండింగ్లో ఉండడంతో గ్రామ కార్యదర్శులు అనేక అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్ల నుంచి గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో పైఅధికారుల సూచన మేరకు తామే వివిధ అభివృద్ధి పనుల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో పనులు చేయించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నామని తెలిపారు. రెండేళ్ల నుంచి బిల్లులు పెండింగ్లోనే ఉండడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

News December 21, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

NLG: 23న కేటీఆర్ రాక.. ఏర్పాట్ల పరిశీలన
NLG: ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
మిర్యాలగూడలో నకిలీ వైద్యుల గుట్టురట్టు
నల్గొండలో ప్రమాదకరంగా మ్యాన్ హోల్
చిట్యాల: ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి?
నల్గొండ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
కట్టంగూరు హస్తంలో లుకలుకలు
నిడమనూరు: ఆ 5 గ్రామాల పల్లె పగ్గాలు యువత చేతికి
నల్గొండ: త్వరలో సహకార ఎన్నికలు