News August 19, 2024
NLG: రెండేళ్లుగా నిర్వహణకు నిధులు లేవు!

జిల్లాలో రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ను ఏర్పాటు చేసి ఒక్కోదానికి రూ.22 లక్షలు ఖర్చుచేసి జిల్లా వ్యాప్తంగా మొత్తం 140 రైతు వేదికలు నిర్మించారు. వారం వారంవ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణలు ఇస్తూ సీజన్ లో పంటల వారీగా సాగులో మెలకువలను తెలియజేయాలనేది వీటి లక్ష్యం. కాగా 24 నెలలుగా రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు
Similar News
News November 16, 2025
NLG: పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

పత్తి కొనుగోళ్లు, రైతుల సమస్యలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం రాత్రి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్షించారు. రైతుల సంక్షేమం దృష్ట్యా సోమవారం తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులు ఇప్పుడు 12 క్వింటాళ్ల వరకు పత్తిని అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
News November 16, 2025
లోక్ అదాలత్లో 6,362 కేసుల పరిష్కారం: ఎస్పీ

జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో రికార్డు స్థాయిలో పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ఈ లోక్ అదాలత్లో మొత్తం 6,362 కేసులను రాజీ మార్గంలో పరిష్కరించామని ఆయన వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని ఎస్పీ పేర్కొన్నారు.
News November 16, 2025
మిర్యాలగూడకు మంత్రులు..ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా

మిర్యాలగూడలో సోమవారం జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి విచ్చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శెట్టిపాలెం నుంచి అవంతిపురం వరకు నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన వంటి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు.


