News March 9, 2025

NLG: రేపటి నుంచి ఇంటర్ పేపర్ వ్యాల్యూయేషన్

image

ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుందని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ దస్రూనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 10న సంస్కృతం పేపర్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని, మిగిలిన సబ్జెక్టులు ఈ నెల 20, 22, 26న ప్రారంభమవుతాయన్నారు. బోర్డు ఆదేశాల మేరకు పటిష్ఠంగా మూల్యాంకన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News October 23, 2025

MLG: 500 ఓటర్లున్నా జనాబాలో జీరో చూపిస్తోంది: స్థానికులు

image

జంకుతండ గ్రామ పంచాయతీలో 200కు పైగా ఎస్సీ కుటుంబాలు, 500కు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ ఒక్క వార్డు సభ్యుడి స్థానం కూడా కేటాయించలేదని స్థానికులు తెలిపారు. 2011 జనాభా లెక్కల్లో ఎస్సీ జనాభాను ‘జీరో’గా చూపించారు. ఈ మేరకు ఎస్సీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నాగరాజు, భరత్, సోమయ్య పాల్గొన్నారు.

News October 23, 2025

మిర్యాలగూడ: డీసీఎంలోనే గుండెపోటుతో డ్రైవర్ మృతి

image

గుండెపోటుతో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన ఘటన జనగామ(D) దేవరుప్పుల(M) కామారెడ్డిగూడెం స్టేజ్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన వెంకన్న జనగామలో పత్తి అన్‌లోడ్ చేసి తిరిగి మిర్యాలగూడ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. రాత్రి నుంచి ఉదయం వరకు డీసీఎం ఆన్‌లో ఉండగా స్థానికులకు డౌట్ వచ్చి గమనించడంతో ఈ విషయం తెలిసింది. పోలీసులకు సమాచారం అందించారు.

News October 23, 2025

NLG : ‘కాల్’ పోదు.. నెట్ రాదు.. BSNLతో తలనొప్పి

image

జిల్లాలో BSNL సేవల్లో అంతరాయంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారులు నెట్ వర్క్ సంబంధిత ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా ఫోన్ కాల్స్ కనెక్ట్ కాకపోవడం.. మాట్లాడుతుండగానే మధ్యలోనే కాల్ కట్ అవడం.. ఇక ఇంటర్నెట్ సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మొబైల్ డేటా రాకపోవడంతో యూపీఐ ద్వారా ఆన్ లైన్ చెల్లింపుల్లో సైతం అంతరాయం ఏర్పడుతుంది.