News March 30, 2024
NLG: రైతులకు రూ.304 కోట్ల నష్టం…!

జిల్లాలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగిలో సాగు చేసిన వరిచేలు పొట్ట దశలో ఎండిపోతున్నాయి. యాసంగి సీజన్లో బోరుబావులపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా 4,20,561 ఎకరాల్లో రైతులు వరినాట్లు వేసుకున్నారు. నీటి ఎద్దడి కారణంగా సుమారు 15 శాతం మేర వరిచేలు ( 60 వేల ఎకరాల్లో పొలాలు) ఎండిపోయాయి. దీంతో రైతులకు రూ.304 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Similar News
News April 22, 2025
నాగార్జునసాగర్ జలాశయం నేటి సమాచారం

నాగార్జునసాగర్ జలాశయం సమాచారాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 514.60 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేయడ లేదు. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 1,350 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News April 22, 2025
NLG: కొత్త కార్డులు ఇచ్చేది ఎప్పుడో..!

జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో 1,25,733 మంది దరఖాస్తులు చేసుకున్నారు. బీసీ కుల గణన సమయంలో 27, 523 మంది.. సవరణల కోసం 37,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన అధికారులు 69,473 దరఖాస్తులకు అప్రూవల్ చేసినా సివిల్ సప్లై శాఖ ఓకే చెప్పలేదు.
News April 22, 2025
NLG: ఇంటర్న్షిప్ పథకం దరఖాస్తులకు ఇవాళే లాస్ట్

ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం 2వ దశ దరఖాస్తు గడువు ఇవాల్టి వరకు పొడిగించినట్లు నల్గొండ జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ వి.కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఇంటర్న్షిప్కు ఎంపికైన విద్యార్థులకు నెలవారి భత్యం రూ.5,000 మంజూరు చేస్తారని తెలిపారు. 12 నెలల ఇంటర్న్షిప్ కాల వ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశానికి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.