News January 28, 2025

NLG: రైతు అకౌంట్లలో పెట్టుబడి సాయం 

image

నల్గొండ జిల్లాలోని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా జమ చేసింది. జిల్లాలోని 33 మండలాలకు గాను గట్టుప్పల్, గుడిపల్లి మండలాలు మినహా 31 మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పెట్టుబడి సాయాన్ని జమచేసింది. 35,568 రైతుల ఖాతాల్లో 73,243 ఎకరాలకు ఎకరాకు రూ.6వేల చొప్పున మొత్తం రూ.46,93,19,160 జమ చేసింది.

Similar News

News November 21, 2025

NLG: కొత్త రూల్స్ అమలు.. దరఖాస్తులు షురూ

image

కంకర మిల్లులకు ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సమూల మార్పులకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగానే క్రషర్ మిల్లులకు, ఖనిజాన్ని సరఫరా చేసే వాహనాల విషయంలో కొత్త రూల్స్ అమలు చేసింది. దీంతో జిల్లాలో 20 క్రషర్ మిల్లుల యజమానులు, 150 టిప్పర్ల యజమానులు కూడా తిరిగి రిజిస్ట్రేషన్ కోసం మైనింగ్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు.

News November 20, 2025

NLG: ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయం ప్రారంభం

image

నల్గొండ జిల్లాలో నూతనంగా నిర్మించిన ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, FCI ED వనిత శర్మ, MLC శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్య నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి, పంపిణీని మెరుగుపరచడానికి ఈ కార్యాలయం దోహదపడుతుందని మంత్రులు పేర్కొన్నారు.

News November 20, 2025

NLG: రోడ్లపై ధాన్యం వద్దు.. ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం రాశులు, రాళ్లు ఉంచడం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహనదారులకు అవి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని ఎస్పీ కోరారు.