News July 22, 2024
NLG: రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 28, 2024 నాటికి భూమి పట్టా పొందిన రైతులంతా అర్హులని పేర్కొన్నారు. నామిని మరణించిన, పేరు మార్పు, ఇతర సవరణలు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 9, 2025
NLG: ఇటు పంట నష్టం… అటు ఆర్థిక భారం!

జిల్లాలో కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పత్తి సేకరణకు కూలీలు దొరకడం లేదు. వరి కోతలు, పత్తి ఏరడం ఏకకాలంలో మొదలయ్యాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా వరి చేలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో నేలకొరిగిన వరి మొలకెత్తాయి. ఉన్న పంటను కోయడానికి కూలీలు, వరి కోత మిషన్లు దొరికినా వరి కోయడానికి అధిక సమయం పడుతుండటంతో ఆర్థిక భారంతో రైతులు సతమతమవుతున్నారు.
News November 9, 2025
NLG: కూరగాయలు కొనేటట్లు లేదు..!

నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు పైపైకి పోతున్నాయి. నెల రోజుల నుంచి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం ఏ కూరగాయలను తీసుకున్నా కేజీ రూ.20 నుంచి రూ.30 వరకే ఉండేవి. అలాంటిది ఒకేసారి కార్తీకమాసంలో రూ.60 నుంచి రూ.160 వరకు ఎగబాకాయి. ప్రతీరోజూ కూరల్లో వాడే టమోటాలు కేజీ రూ.40కు ఎగబాకింది. ఎన్నడూ లేనట్టుగా కేజీ బీన్స్ రూ.160 వరకు ఉంది. మునగ కాయలు భారీ ధర పలుకుతున్నాయి.
News November 8, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

→మిర్యాలగూడ : మత్తు మాత్రలు అమ్ముతున్న ముఠా అరెస్ట్
→మునుగోడు: అయ్యప్ప స్వాములకు ముస్లిం అన్నదానం
→HYD-VJD హైవే 8 లేన్ల విస్తరణ: కోమటిరెడ్డి
→నల్లగొండ: చెరువుకు చేరుతున్న చేప.. 6 కోట్ల చేప పిల్లల పంపిణీ
→నల్లగొండ: ఎల్లలు MGU దాటిన ఖ్యాతి
→నల్లగొండ: ఈ ఇసుక ఎక్కడి నుంచి వస్తుందో..
→నల్లగొండ: పలువురు జడ్జీలకు స్థాన చలనం
→చిట్యాల: రోడ్డు ప్రమాదం.. కారు పూర్తిగా దగ్ధం


