News December 12, 2024

NLG: లవ్ మ్యారేజ్.. యువకుడి సూసైడ్

image

రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చిట్యాలలో జరిగింది. ఎస్సై ధర్మ తెలిపిన వివరాలు.. స్థానిక వెంటాపురానికి చెందిన రబోయిన మహేష్(26) రెండు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మనస్పర్ధలతో వారిద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన మహేష్ గురువారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News January 17, 2025

మిర్యాలగూడ: ఆ కుటుంబంలో ఆరుగురు DOCTORS

image

నల్గొండ జిల్లా మిర్యాలగూడకి చెందిన రామారావు-జీవనజ్యోతి దంపతులు ఇద్దరు డాక్టర్‌లే. వీరు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే గొప్పవిషయం ఏంటంటే.. వీరి ఇద్దరు కుమారులు శ్రీహర్ష, పృథ్వి, కోడళ్లు అమూల్య, శ్రావ్య కూడా డాక్టర్‌లే. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వైద్య వృత్తిలో ఉండటం అరుదుగా కనిపిస్తుంది.

News January 16, 2025

NLG: షిరిడీలో ఘోర ప్రమాదం.. మృతులు వీరే!

image

షిరిడీ సమీపంలో జరిగిన <<15171774>>ఘోర రోడ్డు ప్రమాదం<<>>లో జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. కొండగడపలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది రెండు రోజుల క్రితం షిరిడీకి వెళ్లారు. నిన్న ఉదయం దర్శనాంతరం తుఫాన్ వాహనంలో సమీప దర్శనీయ స్థలాలు చూసేందుకు వెళ్లి తిరిగి షిరిడీకి వస్తుండగా వారి వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రేమలత(59), ప్రసన్న లక్ష్మీ(45), అక్షిత(20), వైద్విక్ నందన్(6నెలలు) మృతి చెందారు.

News January 16, 2025

రోడ్డు ప్రమాదంలో నలుగురు భువనగిరి జిల్లా వాసులు మృతి

image

మహారాష్ట్రలోని షిరిడీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భువనగిరి జిల్లా వాసులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. మృతులు మోత్కూర్ మున్సిపాలిటీలో పరిధిలోని కొండగడప వాసులుగా తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల చిన్నారి ఉంది. రెండు రోజుల క్రితం వీరు షిరిడీ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం.