News March 30, 2024

NLG: వామ్మో సన్న బియ్యం.. కొనలేం తినలేం!

image

ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం ధరలు సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. బియ్యం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు కట్టడి చేయకపోవడంపై జనం మండిపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. క్వింటా ధర రూ .7వేలు పలుకుతుంది. గతంలో దొడ్డు బియ్యం వాడకం ఎక్కువగా ఉండగా.. రాను రాను వినియోగం తగ్గిపోయింది. దీంతో సన్న బియ్యం ధరలు అమాంతం పెరిగాయి.

Similar News

News October 18, 2025

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం: ఎస్పీ శరత్

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాల్సిందిగా జిల్లాలోని ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, షార్ట్ ఫిల్మ్ మేకర్లకు ఆయన శుక్రవారం ఆహ్వానం పలికారు.

News October 17, 2025

ధాన్యం సరఫరా వాహనాలను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

image

తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం, ధాన్యం సరఫరా వాహనాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన, వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News October 17, 2025

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి

image

గ్రామాలు సుస్థిర అభివృద్ధి దిశగా సాగేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. శుక్రవారం తిప్పర్తి మండలంలోని కంకణాలపల్లిలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. సుస్థిరమైన పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.