News March 30, 2024

NLG: సిబ్బంది నియామకంపై దృష్టి

image

లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు సిబ్బంది నియామకంపై దృష్టి సారించారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో సిబ్బంది పాత్రే కీలకం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. వాటికి ఆర్వోలుగా ఆయా జిల్లాల కలెక్టర్లు వ్యవహరించనున్నారు. వారి ఆధ్వర్యంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించనున్నారు.

Similar News

News April 22, 2025

ఇంటర్ రిజల్ట్స్: నల్గొండ పాస్ పర్సంటేజ్ ఇలా..

image

నల్గొండ జిల్లాలో ఫస్టియర్ పరీక్షను 13,977 మంది రాయగా 7931 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 56.74 శాతంగా ఉంది. సెకండియర్‌లో 12,992 విద్యార్థులకు గాను 8,960 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజ్ 68.97శాతంగా ఉంది.

News April 22, 2025

నాగార్జునసాగర్ జలాశయం నేటి సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయం సమాచారాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 514.60 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేయడ లేదు. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 1,350 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

News April 22, 2025

NLG: కొత్త కార్డులు ఇచ్చేది ఎప్పుడో..!

image

జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో 1,25,733 మంది దరఖాస్తులు చేసుకున్నారు. బీసీ కుల గణన సమయంలో 27, 523 మంది.. సవరణల కోసం 37,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన అధికారులు 69,473 దరఖాస్తులకు అప్రూవల్ చేసినా సివిల్ సప్లై శాఖ ఓకే చెప్పలేదు.

error: Content is protected !!