News July 4, 2024

NLG: స్థానిక ప్రజాప్రతినిధులకు అందని వేతనాలు!

image

జిల్లాలో గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. జడ్పీ చైర్మన్ , జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు ఆరు నెలలుగా గౌరవ వేతనాలు రావడం లేదు. బుధవారంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 742 ఎంపీటీసీలు, 71 మంది ఎంపీపీలు, 71 మంది జడ్పిటిసిలు, ముగ్గురు జడ్పీ చైర్మన్లు ఉన్నారు. ఆరు నెలలుగా వీరి వేతనాలు పెండింగ్ లోనే ఉన్నాయి.

Similar News

News December 19, 2025

NLG: 306 స్థానాల్లో గెలిచిన బీసీలు!

image

జిల్లాలో మొత్తం 869 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటిలో మూడు పంచాయతీలు మినహా మిగతా 866జిపిలకు ఎన్నికలు నిర్వహించారు. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లతో పాటు, జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి 306 స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. దీంతో జిల్లాలో 35.33 శాతం స్థానాలు బీసీలకే దక్కాయి.

News December 19, 2025

ముగిసిన ప్రత్యేక పాలన.. పల్లెలకు కొత్త సారధులు

image

నల్గొండ జిల్లాలో 22 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈనెల 22న నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 869 గ్రామ పంచాయతీలకు గాను, మూడు మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది.

News December 19, 2025

కంప్యూటర్ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ

image

దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ. అనిత తెలిపారు. 12వ తరగతి విద్యార్హత కలిగి, 18 నుంచి 35వ సంవత్సరాలలోపు వయస్సు గల వారికి నల్గొండ మహిళా ప్రాంగణంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.