News August 18, 2024

NLG: అధికారులకు సవాలుగా మారిన LRS

image

ఉమ్మడి జిల్లాలో LRS దరఖాస్తుల పరిశీలన అధికారులకు సవాలుగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రణాళిక విభాగాల్లో 12 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చాలావరకు అధికారుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం అంత సులువుగా కనిపించడం లేదు. 3 నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News September 14, 2025

మునుగోడు: యువతి సూసైడ్

image

తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులకు వెళ్లాలని తల్లి మందలించగా మునుగోడు మండలం చెల్మెడకు చెందిన భవాని (25) పురుగుల మందు తాగింది. చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News September 14, 2025

నల్గొండ: 26,692 కేసుల పరిష్కారం

image

జాతీయ లోక్ అదాలత్ జిల్లాలో విజయవంతంగా ముగిసింది. శనివారం ఒక్క రోజే 26,692 కేసులను పరిష్కరించినట్లు జిల్లా జడ్జి ఎం.నాగరాజు వెల్లడించారు. ఈ అదాలత్‌లో 71 సివిల్, 15,921 క్రిమినల్, 96 మోటార్ వాహన ప్రమాద బీమా, 50 బ్యాంక్, 73 సైబర్ క్రైమ్, 35 ట్రాన్స్‌కో, 10,446 ట్రాఫిక్ చలాన్ కేసులు రాజీ కుదిరి పరిష్కారమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News September 14, 2025

NLG: తెప్ప తిరగబడి మత్స్యకారుడి మృతి

image

చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మత్య్సకారుడు మృతిచెందాడు. ఈ ఘటన శనివారం జరగ్గా ఆదివారం మృతదేహం లభ్యమైంది. మాడుగులపల్లి (M) గజలాపురం గ్రామానికి చెందిన సింగం యాదగిరి (37) ఈనెల 13న చేపలు పట్టేందుకు అతని కొడుకు వరుణ్ తేజ్‌తో కలిసి పానగల్ ఉదయ సముద్రం కట్ట వద్దకు వెళ్లాడు. ఒక్కసారిగా వర్షం కురిసి, బలమైన గాలికి తెప్ప ప్రమాదవశాత్తు తిరగబడి యాదగిరి చెరువులో మునిగి మృతి చెందాడు.