News October 7, 2025

NLG: అధిక వడ్డీ దందా.. తెర వెనుక మరో వ్యక్తి..!

image

పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ నాయక్ <<17937867>>అధిక వడ్డీ<<>> ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేసి పరారీలో ఉండగా అతని ఇంటిపై బాధితులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దందా వెనుక మధు అనే మరో యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. బాలాజీ నాయక్‌తో కలిసి మధు అనే యువకుడు గ్రామీణ ప్రజలే లక్ష్యంగా ఈ దందా నడిపినట్లు సమాచారం. బాలాజీ కంటే మధునే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

Similar News

News October 7, 2025

నల్గొండ: మైనర్‌ హత్యాచారం.. పోక్సో కేసు నమోదు

image

నల్గొండ మండలంలో బాలిక హత్యాచార ఘటనపై పోక్సో కేసు నమోదైంది. ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి గదికి తీసుకెళ్లి హత్యాచారం చేశాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు తక్షణమే నిందితుడు కృష్ణతో పాటు అతని స్నేహితుడిపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

News October 7, 2025

నల్గొండలో ఉర్సు.. ఏర్పాట్లు పరిశీలన

image

నల్గొండలో ఈ నెల 9 నుంచి జరిగే హజరత్ లతీఫ్ షా వలీ ఉర్స్-ఏ-షరీఫ్ వలి ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.

News October 7, 2025

NLG: ఏడు నెలల్లో మూడు హత్యలు

image

కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నల్గొండలో హత్యలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 11న రామగిరిలోని గీతాంజలి అపార్ట్‌మెంట్‌లో మణికంఠ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆగస్టు 27న కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజ్ ఎదురుగా నాంపల్లి మండలానికి చెందిన చింతకింది రమేష్‌ను మర్డర్ చేశారు. తాజాగా డైట్ కాలేజ్ సమీపంలో బాలికను హతమార్చారు. శాంతి భద్రతలు కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.