News June 26, 2024

NLG: అరకొరగానే చిరుధాన్యాల సాగు

image

ఉమ్మడి జిల్లాలో రాను రాను చిరుధాన్యాల సాగు తగ్గిపోతున్నది. కందులు మినహా ఇతర పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. సాగు లాభదాయకంగా ఉన్నా సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం, మార్కెట్లలోనూ మద్దతు లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు వీటివైపు మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది. ప్రస్తుత రబీ సీజన్లో ఉమ్మడి జిల్లాలో కందులు 3940, ఇతర పప్పు దినుసులు 1578 ఎకరాల్లో మాత్రమే సాగు చేనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News June 29, 2024

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి, ధరణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా సమస్యలకు పరిష్కరం దొరుకుతుందన్నారు. శుక్రవారం ఆయన చందంపేట తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 266 ఫిర్యాదులు స్వీకరించినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.

News June 28, 2024

ఉప్పల్‌లో నల్గొండ జిల్లా నిరుద్యోగి సూసైడ్

image

ఉద్యోగం రాకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD ఉప్పల్ PS పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి వాసి వెంకట రాముడు(21) HYDకు ఉద్యోగం కోసం వచ్చాడు. ఎంత తిరిగినా జాబ్ రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో రామాంతాపూర్‌లోని తన బావమరిది సాయికిరణ్ ఇంటికి వచ్చి తండ్రికి ఫోన్ చేశాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపి చనిపోయాడు.

News June 28, 2024

నల్గొండ ఎస్పీని కలిసిన ట్రాన్స్ జెండర్స్

image

నల్గొండ జిల్లా ఎస్పీ శరద్ చంద్ర పవార్‌ను ట్రాన్స్ జెండర్స్ కలిశారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు నందిని మాట్లాడారు. ‘నల్గొండలోని శ్రీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8లో గుంటన్నర స్థలం కొన్నాం. ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందామంటే స్థానికులు అడ్డుకుంటున్నారు’ అని చెప్పారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరామన్నారు.