News March 22, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో మళ్లీ కరువు ఛాయలు

image

కరువు మళ్లీ కోరలు చాస్తోంది. చేతికి అందివస్తుందనుకున్న వరి సహా పండ్ల తోటలు కళ్లముందే వాడిపోతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 11,13,170 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. 1,14,796 ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు సమాచారం. విధిలేని పరిస్థితుల్లో కొంత మంది రైతులు తమ పొలాల్లో పశువులను మేపు తుండగా, మరికొంత మంది ట్యాంకర్లలో నీటిని తరలించి పంటలు ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

Similar News

News April 20, 2025

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన

image

జిల్లాలో రాజీవ్ వికాసం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా 79,052 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఈ దరఖాస్తులను మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 21,120, ఎస్టీ కార్పొరేషన్‌కు 11,515, బీసీ కార్పొరేషన్‌కు 39,274, ఈ బీసీ 1,994, మైనార్టీకి 4,926, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌కు 253 దరఖాస్తులు వచ్చాయి.

News April 20, 2025

ఒకే కాన్పులో ముగ్గురు జననం

image

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండటంతో ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు.

News April 20, 2025

NLG: ప్రతి మూడో ఆదివారం.. బుద్ధవనం టూర్!

image

టూరిజం శాఖ సహకారంతో ప్రతిమ ట్రావెల్స్ ఆధ్వర్యంలో HYD నుంచి నాగార్జునసాగర్‌కు ప్రతి నెలా మూడో ఆదివారం ప్రత్యేకంగా పర్యాటకులకు నాగార్జునసాగర్ టూర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు బుద్ధవనం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు HYD నుంచి బయల్దేరి నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధవనం, నాగార్జునకొండలను సందర్శించిన అనంతరం రాత్రి 9 గంటల వరకు HYDకు పర్యాటకులను చేర్చుతారని తెలిపారు

error: Content is protected !!