News February 19, 2025

NLG: ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకున్నది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కాగా యూటీఎఫ్ తరఫున మరోసారి బరిలోకి దిగిన నర్సిరెడ్డికి వామపక్షాలు మద్దతిస్తున్నాయి.

Similar News

News February 22, 2026

కర్నూలులో జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు

image

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు 810 ఓవర్ స్పీడ్, 642 హెల్మెట్ లేని కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. 270 సెల్ ఫోన్ డ్రైవింగ్, 1,187 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 2,137 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయన్నారు.

News February 22, 2026

వర్షం దెబ్బ.. పాకిస్థాన్ సెమీస్ లెక్కలు తలకిందులు!

image

కొలంబోలో శనివారం పాక్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే. రిజర్వ్ డే లేకపోవడంతో ఇరు జట్లు పాయింట్లను పంచుకున్నాయి. దీంతో పాక్ సెమీస్ చేరాలంటే తర్వాతి 2 మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకే ఒక్క పాయింట్‌తో సల్మాన్ అలీ ఆఘా సేన సెమీస్ పోరు క్లిష్టంగా మారింది.

News February 22, 2026

సంగారెడ్డి: ‘విదేశీ విద్యా నిధికి దరఖాస్తు చేసుకోవాలి’

image

విదేశాల్లో చదువు కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యానిధి కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేశ్ రెడ్డి శనివారం తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www.telanganaepass.gov.inలో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వరకు విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.