News August 27, 2025

NLG: ఏడీసీలో స్పాట్ అడ్మిషన్లు: నర్సింహాచారి

image

ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్), ఐటీఐల్లో 2025-27 సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా ఐటీఐల కన్వీనర్ ఎ.నర్సింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 30లోగా http://iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేయడంతో పాటు మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 3, 2025

పోలీసుల సూచనలను పాటించాలి: నల్గొండ ఎస్పీ

image

గణేష్ నిమజ్జన సమయంలో పోలీసుల సూచనలను పాటించాలని ఎస్పీ శరత్చంద్ర పవర్ నిర్వాహకులను కోరారు. చిన్నపిల్లలు, మహిళలు వృద్దులు జాగ్రత్తగా ఉండాలని, గుంపుల వద్ద వాహనాలలో టపాకులు పేల్చవద్దని సూచించారు. నిర్దేశించిన మార్గంలోనే వెళ్లాలని, స్వచ్ఛంద సేవకుల విధులకు ఆటంకం కలిగించవద్దన్నారు. అత్యవసరమైతే 100, 112కు కాల్ చేయాలని ఎస్పీ సూచించారు.

News September 3, 2025

NLG: పంట నష్టం పై సర్వే..!

image

జిల్లాలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టంపై అధికారులు సర్వే మొదలు పెట్టనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో వరి, పత్తి పంటలకు సంబంధించి 284 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నష్టం అంచనాలు తయారు చేసి నివేదికలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇవాల్టి నుంచి వారం పాటు జిల్లా వ్యాప్తంగా అధికారులు సర్వే నిర్వహించనున్నారు.

News September 3, 2025

NLG: పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

image

నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5,42,589 మంది మహిళా ఓటర్లు ఉండగా, పురుషుల సంఖ్య 5,30,860. దీంతో పురుషుల కంటే మహిళా ఓటర్లు 11,729 మంది అధికంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 869కి చేరింది.