News April 25, 2025
NLG: ఒకే తరహా ఘటనలు.. చర్యల్లో వివక్ష!

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ఘటనల్లో అధికారులు చర్యలు తీసుకోవడంలో వివక్ష చూపుతున్నట్లు తెలుస్తుందని పలువురు అంటున్నారు. KTR (మం) చెరువుఅన్నారంలో 6.18 గుంటల భూమిని DT సుకన్య ఇతరులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంలో సుకన్యను కలెక్టరేట్కు అటాచ్ చేశారే తప్ప చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. HZNRలో పట్టా మార్పిడి విషయంలో మాత్రం తహశీల్దార్ జయశ్రీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Similar News
News April 25, 2025
నల్గొండ: కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం

టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతుంది. ప్రస్తుతమున్న వారు డబుల్ డ్యూటీ చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్ల నియామకం జరిగే వరకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయించినట్లు ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి, కోదాడ, దేవరకొండ డిపోల్లో 90 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు తెలిపారు.
News April 25, 2025
మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు: DIEO

ఇంటర్ ఫెయిలైన, ఇంప్రూవ్మెంట్ రాసుకునే విద్యార్థులకు మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి దస్రూ నాయక్ తెలిపారు. రోజూ 2 పూటల పరీక్ష ఉంటుందన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. అయితే అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.
News April 25, 2025
మిర్యాలగూడ: పెళ్లి కావడం లేదని యువకుడి సూసైడ్

పెళ్లి కావడం లేదని బాధతో యువకుడు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిర్యాలగూడ రైల్వే ఎస్ఐ బి.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్ నగర్ బంధంకు చెందిన చల్లా కళ్యాణ్ పెళ్లి కావడం లేదని కొంత కాలంగా బాధపడుతున్నాడు. బుధవారం బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చిన తరువాత మనస్తాపంతో గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.