News August 31, 2025
NLG: గతేడాది కంటే తక్కువే..!

ఖరీఫ్ సీజన్ సాగు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,73,162 ఎకరాల్లో పత్తి, వరి, ఇతర పంటలను రైతులు సాగు చేశారు. సింహభాగంలో పత్తి.. ఆ తర్వాత వరి సాగైంది. ఈసీజన్లో 11.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. గత వానాకాలం సీజన్లో 11.60,374 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను రైతులు సాగు చేశారు. గతేడాది కంటే ఈసారి తక్కువగానే రైతులు సాగు చేస్తున్నారు.
Similar News
News September 1, 2025
NLG: వీధి కుక్కలపై ప్రచారం.. కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్

వీధి కుక్కల బెడదను నివారించేందుకు మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె సంబంధిత అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. తద్వారా ఈ సమాచారం వారి కుటుంబాలకు చేరుతుందని ఆమె పేర్కొన్నారు.
News September 1, 2025
NLG: జిల్లాలో పరిషత్ ఎన్నికల సందడి

పరిషత్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుంది. జిల్లాలో పోలింగ్ కేంద్రాలు వాటి స్థితిగతులను పరిశీలించి జాబితా రూపకల్పన చేసి నివేదికలను ఉన్నత అధికారులకు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ, 31 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కలెక్టర్ ఆమోదంతో పోలింగ్ స్టేషన్లో తుది జాబితాను ఎంపీడీవోలు ప్రచురించనున్నారు.
News September 1, 2025
నల్గొండలో ఈ ప్రాంతాలు.. అసాంఘిక శక్తులకు అడ్డాలు

NLG జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు అంటున్నారు. పట్టణంలో 4 రోజుల క్రితం జరిగిన ఓ మర్డర్ ప్రజలను విస్మయానికి గురిచేసింది. పగటిపూట ఎక్కడో ఒకచోట సంచరిస్తూ సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్టాండ్, సర్కారు దవాఖాన, అన్నపూర్ణ క్యాంటీన్లలో తిష్ట వేస్తున్నారని స్థానికులు తెలిపారు. పోలీసులు గస్తీ ముమ్మరం చేసి శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నారు.