News January 22, 2025
NLG: గురుకుల ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జ్యోతిబా పులే బాపులే గురుకుల పాఠశాలలలో 5వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి ఈ. స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ఉమ్మడి సొసైటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వెబ్ సైట్ http://www.mjptbcwreis.telangana.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 22, 2026
తిరుపతి జిల్లాలో విషాదం

రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతంలోని జలపాతంలో చెన్నైకు చెందిన మణికంఠన్ (27) మునిగి మృతి చెందాడు. స్నేహితుడు శ్రీనివాసన్తో కలిసి బైక్పై విహారయాత్రకు వచ్చి జలపాతం వద్ద ఈత కొట్టేందుకు నీటిలోకి దిగాడు. అయితే సుమారు 8 అడుగుల లోతైన గుంటలో మునిగిపోవడంతో బయటకు రాలేకపోయాడు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 22, 2026
పత్తిలో గులాబీ రంగు కట్టడికి ముందస్తు జాగ్రత్తలు

ఎండాకాలంలో లోతు దుక్కులను చేసుకోవడం వల్ల గులాబీ రంగు పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు. పత్తి తీతకు ఉపయోగించిన పనిముట్లను రసాయనాలతో శుభ్రం చేసి ఉంచాలి. ఒక ప్రాంతంలో పత్తిని దఫదఫాలుగా కాకుండా ఒకేసారి నాటడం వల్ల పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు. అలాగే వేసవిలో పత్తిని నాటకూడదు. గులాబీ పురుగు ఉద్ధృతి ఉన్నచోట నుంచి పత్తిని లేదా కాటన్ విత్తనాలను తీసుకురాకూడదు, నాటకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
News February 22, 2026
గుంటూరు: రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇచ్చినట్టేనా..?

TDP కంచుకోటగా ఉన్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని బద్దలు కొట్టడానికి YCPకి కొత్త అస్త్రం దొరికిందని YCP నాయకుల్లో చర్చ జోరుగా సాగుతుంది. తాజాగా అంబటి రాంబాబు అరెస్టు ఎపిసోడ్తో వారసురాలు రాజకీయాల్లోకి వస్తారని డౌట్ క్లియర్ అయిందన్న చర్చ నడుస్తుంది. అంబటి ఇంటిపై దాడి తర్వాత కుమార్తె మౌనిక ప్రత్యర్థులపై సంధించిన విమర్శ అస్త్రాలతో రాజకీయాల్లోకి వస్తారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది.


