News April 15, 2024

NLG: గ్రామాల్లో నిరుపయోగంగా నీటి తొట్లు!

image

ఉమ్మడి జిల్లాలో ఎండాకాలంలో పశువుల దాహం తీర్చడానికి ఉపాధిహామీ నిధులతో నిర్మించిన నీటి తొట్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని గ్రామాల్లో నీళ్లతో ఉండాల్సిన తొట్లలో చెత్తాచెదారం పేరుకుపోయాయి. NLG, SRPT, యాదాద్రి BNG జిల్లాలోని అనేక గ్రామాల్లో మూడేళ్లక్రితం గ్రామానికి రెండు చొప్పున పశువుల నీటి తొట్లు నిర్మించారు. కానీ ఎక్కడా తొట్లలో నీళ్లు నింపి పశువులకు దప్పిక తీరుస్తున్న దాఖలాలు లేవని రైతులు తెలిపారు.

Similar News

News July 11, 2025

NLG: న్యాయవాద వృత్తిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో లా కోర్సు చేసిన బీసీ విద్యార్థుల నుంచి న్యాయవాది వృత్తిలో మూడేళ్ల పాటు ఉచిత శిక్షణ పొందేందుకు 2025-26కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన కళాశాల నుంచి లా కోర్స్ పాసై ఉండాలన్నారు. జిల్లాలో నలుగురు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 11, 2025

NLG: ఈ ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

image

బీసీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1740 గ్రామపంచాయతీలు ఉన్నాయి. దీంతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు దక్కనున్నాయి.

News July 10, 2025

జూలై 18న మూసీ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల

image

మూసీ ప్రాజెక్ట్ నుంచి వానాకాలం సాగు సీజన్‌కు సంబంధించిన నీటి విడుదలను జూలై 18న ప్రారంభించనున్నట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 641.63 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, సూర్యాపేటకు తాగునీరు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.