News February 4, 2025

NLG: చికెన్ ముక్క కోసం పంచాయితీ

image

చికెన్ ముక్క రెండు గ్రామాల మధ్య వివాదానికి తెరలేపింది. స్థానికుల వివరాలు.. మేళ్లచెరువులోని ఓ చికెన్ దుకాణంలో మరో గ్రామానికి చెందిన వ్యక్తి చికెన్ కొనుగోలు చేశాడు. చికెన్ ముక్క కోరిన విధంగా ఇవ్వలేదని ప్రశ్నించగా షాపు నిర్వాహకుడు దాడి చేశాడు. షాపు నిర్వాహకుడిపై బాధితుడి తరఫు బంధువులు దాడి చేశారు. దీంతో 2 గ్రామాల మధ్య పంచాయితీ మొదలై పెద్ద మనుషుల జోక్యంతో చికెన్ షాప్ యజమానికి జరిమానా విధించారు.

Similar News

News July 6, 2025

రేపటి నుంచి పెరగనున్న భక్తుల రద్దీ

image

నెల్లూరులోని బారాషహిద్ దర్గా వద్ద నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుంది. అన్ని గ్రామాల్లో జరుగుతున్న మొహర్రం వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. దీంతో నేడు బారాషహిద్ దర్గా వద్ద భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దర్గా వద్ద పోలీస్ అధికారులు 1700 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

News July 6, 2025

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8గంటల వరకు 38.0 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా మహదేవ్‌పూర్ 3.8, మల్హర్‌రావు 11.2, మొగుళ్లపల్లి 6.2, రేగొండ 2.4, ఘన్‌పూర్ 13.4, భూపాలపల్లి 1.0 మి.మీటర్ల వర్షం నమోదైంది.

News July 6, 2025

ఆప్షనల్ సెలవులు స్కూళ్లకు కాదు: పాఠశాల విద్యాశాఖ

image

AP: ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవులపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇవి స్కూలు మొత్తానికి ఇచ్చేందుకు కాదని చెప్పారు. అటు ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఎవరైనా ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ బడుల్లో కనిపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.