News October 22, 2024
NLG: జిల్లాలో మొక్కుబడిగానే ప్రజావాణి

జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా జరుగుతున్నట్లు లబ్ధిదారులు తెలిపారు. దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుదారులకు అధికారుల నుంచే చుక్కెదురవుతున్నది. జిల్లాలో కొన్ని మండలాల్లో ఈ కార్యక్రమం నామమాత్రానికే పరిమితమైంది. గత కొన్ని నెలలుగా ఫిర్యాదుదారులు ఎవరు దరఖాస్తులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.
Similar News
News October 17, 2025
ధాన్యం సరఫరా వాహనాలను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం, ధాన్యం సరఫరా వాహనాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన, వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
News October 17, 2025
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి

గ్రామాలు సుస్థిర అభివృద్ధి దిశగా సాగేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. శుక్రవారం తిప్పర్తి మండలంలోని కంకణాలపల్లిలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. సుస్థిరమైన పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
News October 17, 2025
NLG: ఆ 7 దుకాణాలకు బోణీ కాలేదు!

జిల్లాలో 154 మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో 7 మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తులు బోణీ కాలేదు. ఇందులో దేవరకొండలో 70, చండూరులో 106, 108వ నెంబర్, ఓపెన్ కేటగిరి షాపులు, హాలియాలోని 128, 129 , 130 ఎస్సీ రిజర్వు, నాంపల్లిలోని 14వ నెంబరు ఎస్సీ రిజర్వ్ షాపులు ఉన్నాయి. గతంలో 757 దరఖాస్తులు రాగా.. ఇప్పుడు అందులో సగం కూడా దరఖాస్తులు రాకపోవడం గమనార్హం.