News March 30, 2025

NLG: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది విషెష్

image

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని శుభాలు కలగాలని.. సుభిక్షంగా ఉండాలని పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని పేర్కొన్నారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలాషించారు.

Similar News

News April 1, 2025

NLG: ఆన్‌లైన్‌లో పేరు ఉన్నా.. సన్న బియ్యం!

image

కొత్తగా రేషన్ కార్డులు మంజూరై పౌరసరఫరాల శాఖ పోర్టల్లో పేర్లు ఉన్న వారికి కూడా సన్న బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నూతనంగా కార్డులు జారీ కాకున్నా పోర్టల్లో పేర్లు ఉన్న వారికి సైతం సన్న బియ్యం అందనున్నాయి. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఆ మేరకు పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

News April 1, 2025

NLG: మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు

image

యువత స్వయం ఉపాధిలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం యువ వికాసం పథకానికి శ్రీకారం కొట్టిన విషయం తెలిసిందే. తొలుత దరఖాస్తులకు ఏప్రిల్ 5 వరకు అవకాశం కల్పించింది. అయితే సర్వర్ సమస్యలు, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో వాటి జారీకి సమయం పడుతోంది. దీంతో దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించింది. జిల్లాలో ఇప్పటివరకు 22,356 మంది దరఖాస్తు చేసుకున్నారు.

News April 1, 2025

NLG: ఎల్ఆర్ఎస్‌కు స్పందన అంతంత మాత్రమే!

image

ఉమ్మడి జిల్లాలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీంకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే లభించింది. ఎల్ఆర్ఎస్ కింద మార్చి 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే వారికి ప్రభుత్వం 25% రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్చి 29 వరకు 1418 ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఒక్క సోమవారం మాత్రం 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.

error: Content is protected !!