News October 23, 2025

NLG: డీసీసీకి పెరిగిన డిమాండ్.. పైరవీల జోరు!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 డీసీసీ అధ్యక్ష పదవులకు డిమాండ్ పెరిగింది. పదవి కోసం కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా దరఖాస్తు చేశారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో దరఖాస్తుదారుల నుంచి అభిప్రాయలను సైతం సేకరించారు. పరిశీలకులు ఈ నెల 26న ముగ్గురి పేర్లను ఏఐసీసీకి అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలో డీసీసీ పదవుల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మరోవైపు కొత్తవారికి అవకాశం అంటూ ప్రచారం జరుగుతుంది.

Similar News

News October 23, 2025

విజయవాడ-సింగపూర్‌ విమాన బుకింగ్స్‌ ప్రారంభం

image

నవంబర్‌ 10 నుంచి ప్రారంభం కానున్న ‘విజయవాడ-సింగపూర్‌’ విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్‌ను ఇండిగో సంస్థ వెబ్‌సైట్‌లో ప్రారంభించింది. ఈ విమాన సర్వీసులు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో నడవనున్నాయి. టికెట్ ధర రూ.7,500గా నిర్ణయించారు.

News October 23, 2025

బాలింతలు ఏం తినాలంటే?

image

ఒక మహిళ జీవితంలో ఎక్కువ కెలోరీలు అవసరమయ్యేది బాలింత దశలోనే. బిడ్డకు పాలివ్వడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ సమయంలో సమతులాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టిఫిన్, లంచ్, డిన్నర్ మధ్యలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ జావలు, సూప్స్, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వులు, చక్కెర, ఉప్పులున్న ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి.

News October 23, 2025

జూబ్లీహిల్స్‌లో 100 మంది రౌడీషీటర్లు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ పోలీసులు రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిఘా పెట్టారు. నియోజకవర్గ పరిధిలో 100 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. జూబ్లీ‌హిల్స్ PS పరిధిలో ఇద్దరు, సనత్‌నగర్‌లో ఒక్కరు, మధురానగర్‌లో 19 మంది, గోల్కొండలో ఒక్కరు, బోరబండలో 71 మంది, టోలిచౌకిలో నలుగురు, పంజాగుట్టలో ఇద్దరు ఉన్నారు.