News April 13, 2025
NLG: దరఖాస్తు చేసుకోలేకపోయాం.. గడువు తేదీ పొడగించండి!

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఈనెల చివరి వరకు పొడిగించాలని జిల్లాలోని యువకులు కోరుతున్నారు. చాలామంది వివిధ కారణాలతో పాటు సర్వర్ డౌన్ కావడంతో దరఖాస్తు చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తోంది. చాలామంది యువకులు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలను తీసుకోలేకపోయారు. ప్రభుత్వం స్పందించి గడువు తేదీని పొడిగించాలని కోరుతున్నారు.
Similar News
News April 15, 2025
పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.
News April 15, 2025
చీకోటి ప్రవీణ్పై నల్గొండలో కేసు నమోదు

బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ కుమార్పై నల్గొండ వన్టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నల్గొండలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న చీకోటి ప్రవీణ్ కుమార్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులొచ్చాయి. దీంతో అతనిపై 188, 153 సెక్షన్ల కింద నల్గొండ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
News April 14, 2025
NLG: పత్తి సాగు ప్రశ్నార్ధకమేనా?

నల్గొండ జిల్లాలో పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవిచూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్యాకెట్ధర రూ.710 ఉండగా ప్రస్తుతం 901కి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.