News October 15, 2025
NLG: నిమ్మ ధరల పతనంతో రైతుల బేజారు

నిమ్మ ధరలు భారీగా తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో సూమారు 30వేల ఎకరాలకు పైగానే నిమ్మ తోటలున్నాయి. దాదాపు 20 వేల రైతు కుటుంబాలు, కౌలుదారుల కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే ఏటా మూడు లక్షల టన్నులకు పైనే నిమ్మ దిగుబడి వస్తోంది. ప్రస్తుతం ఒక బస్తా పండు కాయలు రూ.70 నుంచి 100లు, పచ్చికాయలు రూ.100 నుంచి 200కు మించి పలకడం లేదు.
Similar News
News October 15, 2025
MGU డిగ్రీ పరీక్ష ఫీజు.. 25 వరకు గడువు

నల్గొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(ఎంజీయూ) పరిధిలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 25వ తేదీ ఆఖరు అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఓఈ) డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఆలస్య రుసుం రూ.100తో అక్టోబరు 27 వరకు ఫీజు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.
News October 15, 2025
అంతరపంటగా ‘అనప’.. ఎకరాకు రూ.10వేల ఆదాయం

రబీలో వేరు శనగ, జొన్న, ఆముదం, కంది పంటల్లో అంతరపంటగా సాగు చేయడానికి అనపకాయలు అనుకూలం. 60-70 రోజులకు పూతకు వచ్చి 130 రోజుల్లో పంట కాలం పూర్తవుతుంది. ఎకరాకు 1-2KGలను 90*20సె.మీ దూరం ఉండేలా గొర్రు లేదా నాగలితో విత్తుకోవాలి. ఎకరాకు 8KGల నత్రజని, 20KGల భాస్వరం, 10KGల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. ఎకరాకు సాగు ఖర్చు రూ.1,500-2K, నికర ఆదాయం రూ.10K వరకు ఉంటుంది.
News October 15, 2025
MBNR: మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎమ్మెల్యేలు

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల దామోదర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం బెంగుళూరులోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లికార్జున ఖర్గే ఆరోగ్య సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాజా రాజకీయాలపై చర్చించారు.