News May 20, 2024
NLG: నేటి నుంచి టెట్ పరీక్షలు

టెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ టెట్ పరీక్షలు ఈనెల 20న ప్రారంభమై జూన్ 2 వరకు కొనసాగుతాయి. వివిధ తేదీల్లో రకరకాల సబ్జెక్టులకు సంబంధించి టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో ఆన్లైన్ పరీక్షకు నల్గొండలోని ఎస్పీఆర్ పాఠశాల ప్రాంగణంలో సెంటర్ ఉంది. ఇక్కడ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఒక్కో సెషన్కు సుమారుగా 180 మంది వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Similar News
News February 24, 2026
NLG: సొంతింటి కల.. పాలకుల మాయాజాలం!

రాజకీయ చదరంగంలో పేదల సొంతింటి కల కేవలం ఓటు బ్యాంకు పావుగా మారుతోంది. ఎన్నికల వేళ హామీల వర్షం కురిపిస్తున్న పాలకులు, తీరా గెలిచాక ఆ ఇళ్లను గాలికొదిలేస్తున్నారు. నల్గొండలో కోట్ల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలు నేడు పాలకుల నిర్లక్ష్యంతో పాడుబడుతున్నాయి. చూడ్డానికి కోటలా ఉన్నా, నివసించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులకు అందక ఈ ఇళ్లు నేడు శిథిలావస్థకు చేరుతున్నాయి.
News February 24, 2026
NLG: గృహలక్ష్మి లబ్ధిదారులకు ‘ఇందిరమ్మ’ ఊరట

గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద బేస్మెంట్ స్థాయి వరకు ఇళ్లు నిర్మించుకుని, నిధులు అందక నిలిచిపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. వీరిని ఇందిరమ్మ ఇళ్ల పథకంలోకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. బేస్మెంట్ వరకు కట్టిన వారికి లక్ష రూపాయలు మినహాయించి, మిగిలిన నాలుగు లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించనుంది.నల్గొండ జిల్లాలో 150 మందికి ఈ అవకాశం కల్పించారు.
News February 24, 2026
NLG: రైస్ మిల్లర్లపై పోలీసు కేసుల కలకలం!

జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు కన్నెర్ర చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా అక్రమాలకు పాల్పడిన పలువురు మిల్లర్లపై రెండు రోజుల నుంచి వరుసగా కేసులు నమోదు చేయించడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బియ్యం మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వెనువెంటనే ఎఫ్.ఐ.ఆర్లు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.


