News October 24, 2025
NLG: పత్తి రైతులకు మార్కెటింగ్ ఏడీ కీలక సూచన

జిల్లాలో పత్తి రైతులకు జిల్లా మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయాదేవి కీలక సూచన చేశారు. సీసీఐ కేంద్రాలకు రైతులకు తీసుకొచ్చే పత్తిలో తేమశాతం 8 నుంచి 12 వరకు ఉండేలా ఆరబెట్టాలని తెలిపారు. తేమశాతం తక్కువ ఉంటేనే ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.8100 చెల్లిస్తుందన్నారు. స్లాట్ బుక్ చేసుకున్నాక పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు.
Similar News
News October 25, 2025
సంగారెడ్డి: రేపు జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం

జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో రేపు(శనివారం) ఉదయం 8 గంటలకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్తం దానం చేయాలనుకునే వారు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు.
News October 25, 2025
రాజేంద్రనగర్: అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు అందుబాటులోకి రానున్నాయని ఉప కులపతి అల్దాస్ జానయ్య ప్రకటించారు. ప్రభుత్వం PJTAUకి 3 నూతన వ్యవసాయ కళాశాలలని మంజూరు చేసిందని హుజూర్నగర్ కళాశాలలో 30 సీట్లు, కొడంగల్లో రానున్న కళాశాలలో 30 సీట్లు, నిజామాబాద్ కళాశాలలో 30 సీట్లు అందుబాటులోకి రానున్నాయని జానయ్య వివరించారు.
News October 25, 2025
పటాన్చెరు: బీరంగూడ శంభుని కుంట చెరువులో మృతదేహం

బీరంగూడ శంభుని కుంట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. అమీన్పూర్ మున్సిపాలిటీలోని మంజీరా నగర్ కాలనీ చెందిన తన్నీరు శ్రీను(49) భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అతడి కొడుకు వాసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


