News August 18, 2025
NLG: పాత వారితోపాటు కొత్తవారికీ కూడా..!

నల్గొండ జిల్లాలో కొత్త, పాత రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రజా పంపిణీ కేంద్రాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సెప్టెంబర్ నెల కోటా బియ్యాన్ని రాష్ట్రస్థాయి గోదాముల నుంచి మండల లెవెల్ స్టాక్ పాయింట్లకు తరలించే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఈ పంపిణీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.
Similar News
News August 18, 2025
NLG: ప్రజావాణికి డుమ్మాపై కలెక్టర్ ఆగ్రహం

నల్గొండ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫోకస్ పెట్టారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ దృష్టి సారించారు. ఇదిలా ఉండగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి కొంత మంది జిల్లా స్థాయి అధికారులు డుమ్మా కొడుతున్నారు. ప్రజావాణికి హాజరు కాకుండా.. కింది స్థాయి సిబ్బందిని పంపించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News August 18, 2025
భూముల హద్దుల నిర్ధారణకు… కొత్త సర్వే మాన్యువల్!

జిల్లాలో భూముల హద్దులను నిర్ధారించేందుకుగాను కొత్త సర్వే మాన్యువల్ ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గత పదేళ్ల కాలంలో సర్వే విభాగం పూర్తి నిర్లక్ష్యానికి గురైన విషయం తెలిసిందే. ప్రజా పాలనలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే వ్యవస్థకు నూతన హంగులు తెస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దీంట్లో భాగంగా ఇవాల్టి నుంచి లైసెన్సుడ్ సర్వేలకు రెండో విడత శిక్షణ ఇస్తున్నారు.
News August 18, 2025
NLG: నల్గొండ కూల్.. చల్లబడ్డ వాతావరణం!

నల్గొండ జిల్లాలో వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో గ్రామాలతో పాటు పట్టణాల్లో చలి తీవ్రత పెరుగుతుండడంతో గజగజ వణికి పోతున్నారు. గత రెండు రోజులుగా చలి తీవ్రత కారణంగా జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో వృద్ధులు, చిన్నారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.