News August 27, 2025

NLG: ప్రారంభం అట్టహాసమే.. కానరాని ఎగ్ బిర్యానీ!

image

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఎగ్ బిర్యానీ పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. కేంద్రాలకు సరిపడా నిధులు ఇవ్వకపోవడంతో ఎగ్ బిర్యానీ అటకెక్కింది. ఈ కేంద్రాలకు ఇప్పటికే సరిపడా నిత్యావసర సరుకులు సరఫరా చేయడం లేదని.. ఎగ్ బిర్యానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతామని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News August 27, 2025

గణపతి పల్లకి మోసిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని

image

వేయి స్తంభాల గుడిలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య గణపతి మహారాజ్‌కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపతికి నిర్వహించిన పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేయి స్తంభాల దేవాలయం చుట్టూ గణపతి పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పల్లకిని భుజాలపై మోశారు.

News August 27, 2025

KMR: వరద బీభత్సం.. 60 మందిని కాపాడిన పోలీసులు

image

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సుమారు 60 మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన కామారెడ్డి పట్టణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో సురక్షితంగా రెస్క్యూ చేసి, సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు.

News August 27, 2025

ఆదిలాబాద్: భారీ వర్షాలు.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

image

రానున్న 3, 4 రోజుల పాటు ఆదిలాబాద్‌లో మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలో 18004251939 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. అధికారులు పూర్తి అప్రమత్తతో ఉన్నారని పేర్కొన్నారు.