News September 23, 2025
NLG: బతుకమ్మ వేడుకలపై పోలీసుల నిఘా

బతుకమ్మ సంబరాల్లో మహిళలు, యువతులపై వేధింపులు, ఈవ్ టీజింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News September 23, 2025
నల్గొండ సీపీఓగా ఆర్డీవో అశోక్ రెడ్డి అదనపు బాధ్యతలు

నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి సోమవారం నల్గొండ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా (సీపీఓ) అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో సీపీఓగా బాధ్యతలు నిర్వహించిన సూర్యాపేట అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్. కిషన్ అందుబాటులో ఉండకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆయన్ను తొలగించారు. దీంతో ప్రస్తుత సీపీఓగా ఆర్డీవో అశోక్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
News September 23, 2025
దుర్గోత్సవాల్లో డీజేలు, టపాసులు నిషేధం: ఎస్పీ

దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఉత్సవాల్లో టపాసులు, డీజేలను నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. చిన్నపాటి లౌడ్స్పీకర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల తర్వాత వాటిని కూడా నిలిపివేయాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News September 23, 2025
గ్రీవెన్స్ డే సమస్యలు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

నల్గొండ: ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు మరింత కృషి చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 37 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.