News January 30, 2026
NLG:’ భరోసా ‘ ఇప్పట్లో లేనట్లేనా?

జిల్లాలో యాసంగి పంటల సాగు ప్రారంభమై 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ రైతు భరోసా అందలేదు. శాటిలైట్ సర్వే పేరిట సర్కారు జాప్యం చేస్తోంది. జిల్లాలో రైతు భరోసా కోసం సుమారు 2 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఇప్పట్లో పెట్టుబడి సాయం అందే అవకాశాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 5, 2026
నల్గొండ: ‘పుర’ పోరులో పాత నేతలే.. గుర్తులు వేరు

నల్గొండ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల సమరం ఉత్కంఠగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అసలైన అభ్యర్థుల జాబితా ఖరారైంది. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకుని పోటీ పడుతున్నారు. నాయకులు వారే అయినా, పార్టీ గుర్తులు మాత్రం మారాయి. అధికార పార్టీ అండతో విజయంపై వారు ధీమాగా ఉండగా, సామాన్య ఓటరు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.
News February 5, 2026
NLG: భార్యల గెలుపునకు భర్తల ఇంటింటి ప్రచారం

మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో భర్తల కోసం భార్యలు ప్రచారం చేయగా, ఇప్పుడు భార్యల గెలుపు కోసం భర్తలు జెండాలు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. ముఖ్యంగా నల్గొం, మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్ పర్సన్ పీఠాలు మహిళలకే కేటాయించడంతో అభ్యర్థుల భర్తలు ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
News February 5, 2026
NLG: ఏదీ గిరి వికాసం.. అటకెక్కిన మరో పథకం!

జిల్లాలో గిరిజన రైతు కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంతో చేపట్టిన సీఎం గిరి వికాస పథకం అటకెక్కింది. రెండేళ్ల క్రితమే జిల్లావ్యాప్తంగా గిరిజన లబ్ధిదారులను గుర్తించి వారి భూముల్లో 56 బోర్లు వేసినా.. వాటికి విద్యుత్ సౌకర్యం, మోటార్లు అందించలేదు. రెండేళ్లుగా ఎలాంటి కదలిక లేకపోవడంతో అసలు ఈ పథకం ఉందా లేదా అని లబ్ధిదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.


