News July 6, 2025
NLG: ‘భూభారతి.. ఎలాంటి ఓటీపీలు అడగడం జరగదు’

భూ సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం రైతులను ఎలాంటి ఓటీపీ అడగడం జరగదని, అసలు ఓటీపీ సమస్యే రాదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. Way2News ఇవాళ ప్రచురితమైన వార్తకు కలెక్టర్ స్పందించారు. తహశీల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ వివరించారు. అందువల్ల రైతులు ఎవరు ఈ విషయాలను నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News November 6, 2025
NLG: రిజిస్ట్రేషన్ చివరి తేదీ మరో 4 రోజులే

వికసిత భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వికసిత్ భారత్ ప్రోగ్రాం చైర్మన్, నల్గొండ ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ కోరారు. దేశాభివృద్ధిలో విద్యార్థుల సృజనాత్మకత సందేశాత్మక వీడియో రూపొందించి అసెంబ్లీ, పార్లమెంటులో మాట్లాడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అందుకు ఈనెల 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
News November 6, 2025
సాగర్లో నేటి నుంచి బీసీ గురుకులాల క్రీడలు

నాగార్జునసాగర్ హిల్ కాలనీలో గల మహాత్మాజ్యోతిబా ఫులే బీసీ గురుకుల పాఠశాలలో గురువారం నుంచి బీసీ గురుకుల పాఠశాలల, కళాశాలల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే పోటీల్లో అండర్-14, 17, 19 విభాగాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు అండర్ -14 విభాగాలకు క్రీడలు నిర్వహిస్తామన్నారు.
News November 6, 2025
ఇక మహానగరంగా మన నల్గొండ..!

నల్గొండ త్వరలో మహానగరంగా రూపుదిద్దుకోనుంది. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపింది. 1951లో NLGను 12 వార్డులతో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనాభా పెరగడం, పట్టణం క్రమంగా విస్తరించింది. 2011లో విలీన గ్రామాలను కలిపి 48 వార్డులను 50 డివిజన్లుగా విభజించనున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 2.25 లక్షలకు పైగా జనాభా ఉన్నారు.


