News February 12, 2025

NLG: మహిళా టీచర్ల సమస్యల పరిష్కారానికే పోటీ: అర్వ స్వాతి

image

మహిళా టీచర్ల సమస్యలను కౌన్సిల్లో తీర్చేందుకే స్వతంత్ర మహిళ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అర్వ స్వాతి తెలిపారు. తన నామినేషన్ స్క్రూటినీలో ఓకే అయిన సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో 4 సార్లు జరిగిన ఎన్నికలలో మహిళలు పోటీలో లేరని, మెజారిటీ మహిళలు సంఘ బాధ్యులుగా లేని కారణంగా ఏ సంఘం మహిళా అభ్యర్థులను పోటీకి నిలపలేదని, పురుష అభ్యర్థులను గెలిపిస్తే మహిళల సమస్యలు పరిష్కరించలేదన్నారు.

Similar News

News February 12, 2025

ఈతకు వచ్చి మునుగోడు యువకుడి మృతి

image

నల్గొండ మండలం నర్సింగ్ భట్లలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వచ్చి మునుగోడు మండలం గూడపూర్‌కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడపూర్‌కు చెందిన వ్యక్తి నర్సింగ్ భట్లలోని AMRP కాలువలోకి ఈతకు వచ్చి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు.

News February 12, 2025

నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి 

image

నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి NLG జిల్లాకు రానున్నారు. ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9:30 గంటలకు నార్కెట్ పల్లి మండలం గోపలాయిపల్లి గ్రామంలోని శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించనున్నారు.

News February 12, 2025

చెరువుగట్టు హుండీ ఆదాయం రూ. 16,45,100

image

చెర్వుగట్టు శ్రీపార్వతీ జడలరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. పది రోజులకు గాను అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.3,19,600లు, స్వామివారి హుండీ ఆదాయం రూ. 13,25,500లు లభించినట్లు ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ నల్గొండ డివిజన్ పరిశీలకురాలు బి. సుమతి, దేవస్థాన పర్యవేక్షకులు జి. తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

error: Content is protected !!