News April 2, 2024

NLG: మామిడి పండ్ల ధరలకు రెక్కలు

image

ఉమ్మడి జిల్లా ప్రజలకు ఈ ఏడాది మామిడి మహా ప్రియం కానుంది. సీజన్‌ లేట్‌గా ప్రారంభమైంది. పంట ఆలస్యం కావడం.. తక్కువ దిగుబడి రావడమే కారణం. దీంతో మామిడి ప్రియుల జేబులు ఖాళీ కానున్నాయి. ఎందుకంటే హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే మామిడి పండ్ల ధరలు కేజీ రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతున్నాయి. జిల్లాలో ఈసారి కాత ఆశించినంత లేకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో ధరలు కూడా భగ్గుమంటున్నాయి.

Similar News

News September 9, 2025

NLG: సులువుగా ఎర.. చిక్కితే విలవిల

image

నల్గొండ జిల్లాలో రోజు రోజుకు సైబర్‌ నేరగాళ్లు పేట్రేగి పోతున్నారు. నిరక్షరాస్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు సైతం వీరి ఉచ్చులో పడి మోసపోతున్నారు. ఇటీవల మిర్యాలగూడకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి వీడియో కాల్‌ చేసి మీపై పోక్సో కేసు ఉందని బెదిరించి రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులను ఆశ్రయించగా అది సైబర్‌ నేరగాళ్ల పనేనని వారు నిర్ధారించారు.

News September 9, 2025

జిల్లాలో ఎంపిక చేసిన రైతు వేదికలు ఇవే..!

image

గుడిపల్లి, కుపాశిపల్లి, చందంపేట, బంగారిగడ్డ, జీకేఅన్నారం, <<17654326>>కుర్మేడ్, అప్పాజీపేట, <<>>కొండ్రపోల్, కమలాపూర్, మొలకచర్ల, చెర్యాకుపల్లి, గట్టుప్పల్, భీమారం, ఇప్పాలగూడెం, పెండ్లిపాకల, ధర్మాపురం, మునుగోడు, చందుపట్ల, పాలెం, రామడుగు, దోమలపల్లి, సుంకిశాల, అక్కినేపల్లి, నెమ్మాని, అమ్మనబోలు, నేరేడుగొమ్ము, ముప్పారం, రేగులగడ్డ, పర్వేదుల, SGకొత్తపల్లి, మాదారం, తిరుమలగిరి, పెద్దదేవులపల్లి, రావులపెంట రైతు వేదిక.

News September 9, 2025

NLG: రైతు వేదికలో యూరియా

image

రైతులకు <<17654369>>యూరియా సరఫరాలో<<>> ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్‌ల వద్ద రద్దీని తగ్గించడానికి, రైతు వేదికల నుంచి యూరియాను విక్రయించనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 34 రైతు వేదికల్లో ఇప్పటికే నిల్వలు అందుబాటులో ఉంచారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడటం, రద్దీని తగ్గించడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం అని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.