News August 14, 2025
NLG: మైనర్పై అత్యాచారం.. నిందితుడికి 26 ఏళ్ల జైలు

నల్గొండలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు గ్యారల శివశంకర్కు 26 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఈ తీర్పుతో ఇలాంటి నేరాలను అరికట్టడానికి ఒక హెచ్చరికగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News August 14, 2025
IMPS చెల్లింపులపై ఛార్జీలు పెంపు: SBI

IMPS(ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్) చెల్లింపులపై ఛార్జీలను పెంచుతూ SBI నిర్ణయం తీసుకుంది. ఆగస్టు15 నుంచి ఇవి అమలులోకి వస్తాయి. బ్రాంచ్ ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీల్లో మార్పులేదు. ఆన్లైన్లో 25 వేలు-రూ.లక్షలోపు రూ.2, రూ.లక్ష-2 లక్షలలోపు రూ.6, రూ.2 లక్షల-రూ.5 లక్షలలోపు రూ.10 ఛార్జీలు+GST చెల్లించాలి. శాలరీ అకౌంట్స్ను మినహాయించారు. కార్పొరేట్ కస్టమర్లకు ఇవి SEP 8 నుంచి అమలులోకి రానున్నాయి.
News August 14, 2025
పుతిన్కు ట్రంప్ హెచ్చరికలు

రష్యా అధ్యక్షుడు పుతిన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 15న అలస్కా వేదికగా జరగనున్న సమావేశం తర్వాత ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు రష్యా ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా రాని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆ భేటీ ఊహించిన విధంగా కొనసాగితే.. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీతో కలిసి మరో సమావేశం నిర్వహిస్తామన్నారు.
News August 14, 2025
పెబ్బేరు: బైక్ నుంచి రూ.2.20 లక్షలు చోరీ: SI

పార్కింగ్ చేసిన బైక్ టూల్ బాక్స్ నుంచి రూ.2.20లక్షలు చోరీ చేసిన ఘటన బుధవారం పెబ్బేరులో జరిగింది. శ్రీరంగాపూర్కు చెందిన ఆంజనేయులు పెబ్బేరు SBIలో డబ్బులు డ్రా చేసి బైక్ టూల్ బాక్స్లో ఉంచారు. బీజేపీ క్యాంపులో బైక పార్క్ చేసి అధికారిని కలిసి తిరిగి వచ్చేవరకు నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.