News October 17, 2025

NLG: రైతులకు.. పత్తి వ్యాపారులే దిక్కు!

image

నల్గొండ జిల్లాలో పత్తి దిగుబడులు ప్రారంభమైనా.. కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు చేతికొచ్చిన పంటను నిల్వ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దిగుబడులు ప్రారంభమై 10 రోజులు దాటినా కొనుగోళ్లు లేకపోవడంతో పత్తిని గ్రామంలో ఆరు బయట నిల్వ ఉంచుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 45 లక్షల క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో గత్యంతరం లేక వ్యాపారులకే రైతులు పత్తి అమ్ముతున్నారు.

Similar News

News October 18, 2025

తెలంగాణ బంద్.. ఇది ఎవరిపై పోరాటం?

image

TG: రాష్ట్ర బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. 42% శాతం రిజర్వేషన్ల కోసం BC సంఘాలు బంద్ చేపట్టాయి. దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్ర అధికార పార్టీ BJP కూడా మద్దతు తెలిపాయి. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే మరి బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికా? రాష్ట్ర ప్రభుత్వానికా? అసలు పోరాటం ఎవరిపై?

News October 18, 2025

దోమకొండ టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్

image

దోమకొండకు చెందిన దేవరగట్టు బాలప్రసాద్ 17 ఏళ్ల కృషికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కింది. తన ఆలోచనలను, సాంకేతికతను, మానవత్వాన్ని జోడించి నాయకుడిగా ఉద్యోగులను చేర్చాడు. ఖచ్చితమైన విశ్వాసంతో జనరేటివ్ AI హ్యాకథాన్ మార్పుతో కోడర్‌గా, సృష్టికర్తగా స్వీకరించి, యాప్‌గా కాకుండా మిషన్‌గా భావించాడు. జీవితంలో ప్రేరణ అనేది చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

News October 18, 2025

ఆత్మహత్యకు కారకులైన నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష

image

భూవివాదంలో వ్యక్తిని బెదిరించి ఆత్మహత్యకు కారణమైన 8మంది నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కిరణ్ కుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. అశ్వాపురం(M) మొండికుంటకు చెందిన గూడూరు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు సీఐ రాజు కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.