News October 7, 2024
NLG: రైతులకు మేలు చేసే విధంగా ఉండాలి: మంత్రి కోమటిరెడ్డి
వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం అయన DVK నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేదే వ్యవసాయ మార్కెట్ కమిటీ అని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు మేలు చేయడమే ధ్యేయంగా పని చేయాలన్నారు.
Similar News
News October 8, 2024
లింగాలగూడెంలో క్షుద్ర పూజలు.. భయాందోళనలో గ్రామస్థులు
మండలంలోని లింగాలగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన బొబ్బలి నరసింహ, గన్నేబోయిన వెంకన్న ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన మూటలను ఇళ్లలో పడేసి వెళ్లారు. వాటిని గమనించిన సదరు వ్యక్తులు మూటలు విప్పి చూడగా అందులో పసుపు,కుంకుమ, నిమ్మకాయలు, నవధాన్యాలు, గవ్వలు, జీడిగింజలు, తాటి ఆకు బొమ్మలు బయటపడ్డాయి.
News October 8, 2024
NLG: ఆర్టిఐ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
RTI ఆవిర్భావ దినోత్సవం సదస్సు కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రలు ఆవిష్కరించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరపత్రం ఆవిష్కరించించి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో దుశ్యర్ల సత్యనారాయణ, సైదులు, మేఖల శ్రీహరి, కాడబోయిన సాయి, మల్లయ్య, శంకర్, రాంబాబు పాల్గొన్నారు.
News October 7, 2024
NLG: విషాదం.. కొడుకుకి ఉరేసి తల్లి సూసైడ్.!
యాదాద్రి జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఓ తల్లి కన్న కొడుకుకి ఉరేసి తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దరావులపల్లికి చెందిన జడల సోనీ కొడుకు రియాన్ష్కు ఇంట్లో ఉరేసి తాను సూసైడ్ చేసుకుంది. మానసిక గుబులుతో ఆమె ఈఘటనకు పాల్పడినట్లు కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.