News August 13, 2024

NLG: వారం రోజులు.. 120 టీఎంసీలు

image

కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు కృష్ణా జలాశయాలు నిండు కుండలా మారాయి. వరద భారీగా రావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా వారం రోజుల్లో 120టీఎంసీల నీరు దిగువకు వెళ్లింది. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తగా 12న మధ్యాహ్నం గేట్లు మూసివేశారు.

Similar News

News November 10, 2025

NLG: ర్యాగింగ్‌పై ఉక్కుపాదం: ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

image

ర్యాగింగ్‌ అనే విష సంస్కృతికి విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడి తోటి విద్యార్థుల జీవితాలను నాశనం చేయవద్దని, అలా చేస్తే, ప్రొహిబిషన్‌ ర్యాగింగ్‌ యాక్ట్‌ కింద 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

News November 10, 2025

NLG: ప్రజావాణికి 94 ఫిర్యాదులు

image

నల్గొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 94 ఫిర్యాదులు అందాయి. అందులో జిల్లా అధికారులకు సంబంధించి 31 ఫిర్యాదులు, రెవిన్యూ శాఖకు సంబంధించి 63 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచవద్దని అన్నారు.

News November 10, 2025

నల్గొండ: రూ.549కే రూ.10 లక్షల బీమా

image

నల్గొండ డివిజన్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా 18 నుంచి 65 సం.ల వారికి అత్యంత తక్కువ ప్రీమియంతో గ్రూప్ ప్రమాద బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వైకల్యం సభవింస్తే కేవలం రూ.549 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు కవరేజ్ పొందే విధంగా ప్లాన్ తెచ్చింది. ఈ అవకాశం IPPB ఖాతాదారులకు మాత్రమేనని, వివరాల కోసం పోస్టాఫీసును సంప్రదించాలని అధికారులు కోరారు.