News December 17, 2024

NLG: విద్యార్థినుల పట్ల ప్రిన్సిపల్ కర్కషత్వం

image

వలిగొండ మండలం లోతుకుంట గ్రామం గల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని కోపంతో చేతివేళ్ళపై కొట్టడంతో చేతి మనికట్టు, బొటనవేలు విరిగినట్లు బాధిత విద్యార్థినులు తెలిపారు. ఈ విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం ప్రిన్సిపల్‌ను నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News March 6, 2026

NLG: ఇంటర్ పరీక్షలకు 261 మంది గైర్హాజరు

image

జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 9,796, మంది విద్యార్థులకు గాను 9,620 మంది హాజరుకాగా, 176 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1938 మంది విద్యార్థులకు గాను 1853 మంది హాజరుకాగా, 85 మంది గైర్హాజరయ్యారు.

News March 6, 2026

నల్గొండలో భానుడి ప్రతాపం

image

నల్గొండ జిల్లాలో మార్చి మొదటి వారంలోనే ఎండలు ముదురుతున్నాయి. గత నెల 15 నుంచి క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారం గరిష్ఠంగా 36.5 డిగ్రీలకు చేరాయి. మధ్యాహ్నం వేళ భానుడి సెగలకు జనం అల్లాడిపోతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

News March 6, 2026

డిజిటల్ క్రాప్ సర్వే.. వాలంటీర్లకు అద్భుత అవకాశం

image

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వేలో వాలంటీర్లుగా పనిచేసేందుకు గ్రామీణ నిరుద్యోగ యువతకు అవకాశం లభించింది. జిల్లాలోని 12 లక్షల ఎకరాల్లో 5 లక్షల మంది రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణే ఈ సర్వే లక్ష్యం. ఇప్పటికే మెజారిటీ గ్రామాల్లో నియామకాలు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో ఆసక్తి గల యువకులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి (DAO) శ్రవణ్ కుమార్ కోరారు.