News August 20, 2025

NLG: వివాదాల సుడిగుండంలో పంచాయతీ కార్యదర్శులు..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో <<17460094>>పంచాయతీ కార్యదర్శుల<<>> వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే కొంతమంది కార్యదర్శులు విధులకు హాజరుకాకుండానే ఫేక్ అటెండెన్స్ వివాదంలో ఇరుక్కున్నారు. మరోవైపు ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తుండడం దుమారం రేపుతుంది. ఇప్పటికే జాన్ పహాడ్ పంచాయతీ కార్యదర్శిని SRPT కలెక్టర్ సస్పెండ్ చేశారు. వెలుగులోకి రాని ఘటనలు ఉన్నాయని పలువురు అంటున్నారు.

Similar News

News August 20, 2025

విద్యుత్ కోతలు లేకుండా చూడాలి: కలెక్టర్

image

కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున, సిబ్బంది ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పనులు సాగుతున్న గ్రామాలలో వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు.

News August 20, 2025

NGKL: కరెంట్ తీగలు… కడుపు కోతకు కారణమయ్యాయి!

image

గణపయ్యను హర్షధ్వానాలతో ఊరేగింపుగా తీసుకువస్తుండగా, ఆ మార్గంలో వేలాడుతున్న కరెంట్ తీగలు ఆ యువకుడి ప్రాణాన్ని బలిగొన్నాయి. ఆనందంగా మొదలైన వేడుక ఒక్కసారిగా విషాదంలోకి మారింది. స్థానికుల వివరాలు.. కోడేరు(M) నాగులపల్లితండా వాసి టోని(24) HYDలోని బండ్లగూడలో కుటుంబంతో నివాసముంటున్నారు. ట్రాక్టర్‌పై నిన్న భారీ వినాయకుడిని తీసుకొస్తున్నారు. ట్రాక్టర్ నడుపుతున్న టోనికి కరెంటు వైర్లు తగిలి చనిపోయాడు.

News August 20, 2025

అర్కండ్ల: పొలంలో మహిళకు పాముకాటు.. ఆసుపత్రికి తరలింపు

image

శంకరపట్నం మం. ఆర్కండ్లకు చెందిన చెర్ల రేణుక వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు పాముకాటుకు గురయ్యారు. గమనించిన తోటి రైతులు వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆమెను ద్విచక్రవాహనంపై కేశవపట్నం వైపు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మక్త గ్రామం వద్ద 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలట్ గోపికృష్ణ ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను KNRలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.