News September 22, 2025

NLG: సమృద్ధిగా వర్షాలు.. చేప పిల్లల పంపిణీలో జాప్యం

image

ఈ ఏడాది జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండుగా ఉన్నాయి.. చేప పిల్లల పంపిణీకి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో మత్స్యకార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జిల్లాలో మొత్తం 260 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. అయితే, ఉచిత చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది.

Similar News

News September 22, 2025

VJA: ‘దసరా సెలవుల్లో స్కూల్ నిర్వహిస్తే కఠిన చర్యలు’

image

ప్రభుత్వం నేటి నుంచి దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో, పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్, పేరెంట్స్ మీటింగ్‌లు నిర్వహించరాదని DEO సుబ్బారావు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం DEO ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News September 22, 2025

ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరిన వెండి ధర

image

వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ KG వెండిపై రూ.3000 పెరిగి రూ.1,48,000తో ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. 4 రోజుల్లోనే వెండి ధర రూ.7వేలు పెరగడం గమనార్హం. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.430 పెరిగి రూ.1,12,580కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.400 ఎగబాకి రూ.1,03,200 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 22, 2025

ప్రకాశం: ఇంటర్ కాలేజీలకు RIO వార్నింగ్

image

ప్రకాశం జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని RIO ఆంజనేయులు అన్నారు. కలెక్టరేట్ వద్ద సర్టిఫికెట్ల కోసం నిరసన తెలిపిన విద్యార్థినికి సంబంధిత కళాశాల యాజమాన్యంతో మాట్లాడి సర్టిఫికెట్లు అందించారని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఏ కళాశాల పాల్పడినా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.