News September 26, 2024
NLG: 11 మంది ఎస్ఐలకు స్థానచలనం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 11 మంది ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మహేశ్వర్ను NLG DSB నుంచి SRPTకి, వెంకటేశ్వర్లును NLG VR నుంచి SRPTకి, కృష్ణయ్యను MLG టూ టౌన్ నుంచి మాడుగులపల్లికి, శోభన్ బాబును మాడుగులపల్లి నుంచి NLG VRకు, విజయ్ కుమార్ను వేములపల్లి నుంచి నల్గొండకు, సందీప్ రెడ్డిని NLG 1-టౌన్ నుంచి MLG రూరల్కు బదిలీ చేశారు.
Similar News
News February 22, 2026
NLG: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.
News February 22, 2026
NLG: ఈనెల 27 వరకు పెన్షన్ల పంపిణీ: డీఆర్డీవో

ఆసరా పింఛన్లను 27వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో శేఖర్ రెడ్డి తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు చేయూత, ఆసరా పింఛన్లను ఆయా పోస్టాఫీసులలో అందజేయనున్నట్లు తెలిపారు. పింఛనుదారులు పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ కార్యాలయాల్లో పొందాలని, దళారులను నమ్మవద్దని పేర్కొన్నారు.
News February 22, 2026
నల్గొండలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 48 కేంద్రాలలో మొత్తం 27,905 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని జిల్లా ఇంటర్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించారు.


