News March 3, 2025
NLG: 113 కేంద్రాలు.. 58,222 మంది విద్యార్థులు

ఉమ్మడి NLG జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్స్, ఇన్విజిలేటర్స్ను నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన 58,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Similar News
News March 22, 2025
NLG: టెన్త్ పేపర్ లీక్.. ఇన్విజిలేటర్ సస్పెండ్

నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్లోని ఎస్ఎల్బీసీ బాలిక గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ వ్యవహారంలో డ్యూటీలో ఉన్న అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్ర సూపరింటెండెంట్ను డ్యూటీ నుంచి తొలగించి, ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేసినట్లు MEO నాగయ్య తెలిపారు. పేపర్ లీకేజీకి సహకరించిన బాలికను కూడా డిబార్ చేశామన్నారు.
News March 22, 2025
నల్గొండ మహిళల కోసం జాబ్ మేళా

శ్రీ కాకతీయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో NLG ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. 10 తరగతి, ఇంటర్, డిగ్రీ, ITI, పాలిటెక్నిక్లో ఉత్తీర్ణులు లేదా ఫెయిల్ అయిన మహిళలు 18 సం.ల నుంచి 33 సంవత్సరాల లోపు వారు అర్హులని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీనివాసరాజు తెలిపారు.
News March 22, 2025
ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నల్గొండ అమ్మాయి మృతి

రోడ్డుప్రమాదంలో నల్గొండకు చెందిన యువతి మృతిచెందిన ఘటన తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలిలా.. HYDలో MBBS చేస్తున్న తన చెల్లిని తీసుకురావడానికి నల్గొండ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ORRపై కారు టైర్ పగలడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే యువతి చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు నల్గొండలోని మీర్ బాగ్, రహమాన్ బాగ్కు చెందిన వారిగా గుర్తించారు.