News February 16, 2025
NLG: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
Similar News
News November 14, 2025
భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి దేవస్థానంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. కార్తీక శుక్రవారం కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు.
News November 14, 2025
KVS, NVSలో 14,967 పోస్టుల వివరాలు

<
News November 14, 2025
కాకినాడ- అనకాపల్లి మధ్య ఎయిర్ పోర్టు: CM

ఉమ్మడి తూ.గో జిల్లాలను ఎకనమిక్ రీజియన్లో చేర్చి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో గురువారం జరిగిన సదస్సులో 3 జిల్లాల కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కాకినాడ- అనకాపల్లి మధ్య చిన్న ఎయిర్ పోర్టు నిర్మిస్తామని చెప్పారు. కడియం నర్సరీలు, పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయాలన్నారు. తలసరి ఆదాయం కోనసీమ రూ.2.09 లక్షలు, కాకినాడ రూ.2.42L, తూ.గో రూ.2.59 లక్షలుగా ఉందన్నారు.


