News April 25, 2024
NLG: 22 మంది నామినేషన్లు దాఖలు

నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం NLG పార్లమెంటు స్థానానికి 22 మంది అభ్యర్థులు 28 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. BRS తరఫున కంచర్ల కృష్ణారెడ్డి 2 సెట్లు, బీజేపీ తరఫున నూకల నరసింహారెడ్డి 2 సెట్లు, BJP అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓ సెట్, కాంగ్రెస్ తరపున రఘువీర్ కుందూరు 3 సెట్లు, కుందూరు జానారెడ్డి 2 సెట్లు, డీఎస్పీ తరఫున తలారి రాంబాబు ఓ సెట్ నామినేషన్లు దాఖలు చేశారు.
Similar News
News January 22, 2026
నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలపై వామపక్షాల గురి

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల రణం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల త్రిముఖ పోరులో కమ్యూనిస్టులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కేవలం గెలుపు కోసమే కాకుండా, ఫలితాల తర్వాత ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తమ మద్దతు లేకుండా మేయర్ పీఠం దక్కదని వామపక్షాలు ధీమాగా ఉన్నాయి. బలాబలాల లెక్కల్లో తమదే కీలక పాత్ర అని కమ్యూనిస్టు నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
News January 21, 2026
డిండి: విద్యార్థులను పరామర్శించిన డీఈవో

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న డిండి మోడల్ స్కూల్ విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి, యూటీఎఫ్ నాయకులు బుధవారం పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో నేరుగా మాట్లాడి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు. విద్యార్థులు కోలుకునే వరకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని డీఈవో భరోసా ఇచ్చారు.
News January 21, 2026
NLG: మహిళా సాధికారతే లక్ష్యం: కలెక్టర్ చంద్రశేఖర్

గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు డిపిఎంలు, ఏపీఎంలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల బలోపేతం, ‘ఉల్లాస్ అక్షరమాల’ ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని సూచించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పెండింగ్లో ఉన్న భవన నిర్మాణాలు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలన్నారు.


