News March 30, 2025

NLG: 31 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయి

image

ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) క్రమబద్ధీకరణ 25 శాతం రాయితీ ఇచ్చినందున దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ప్రకాశ్ తెలిపారు. ఆన్‌లైన్‌‌లో ఫీజు చెల్లిపునకు ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉందని, అదే రోజు సెలకు సెలవు దినమైనప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

న్యూమోనియా రహిత సమాజ నిర్మాణం లక్ష్యం: కలెక్టర్

image

న్యూమోనియా వ్యాధి రహిత సమాజ నిర్మాణం లక్ష్యమని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. న్యూమోనియా వ్యాధిపై అవగాహన పోస్టర్లను బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. ప్రతీ సంవత్సరం నవంబర్ 12వ తేదిన ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఊపిరితిత్తులలో అసాధారణ ద్రవం చేరడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని కల్గించే పరిస్థితిని న్యూమోనియా అన్నారు.

News November 12, 2025

గుంటూరు రైల్వే, బస్టాండ్‌లలో భద్రతా తనిఖీలు

image

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అదనపు ఎస్పీ హనుమంతు ఆధ్వర్యంలో జిల్లా భద్రతా విభాగం పోలీసులు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బీడీ టీములు, జాగిల బృందాలు ప్రయాణికుల సామానును, కౌంటర్లను క్షుణ్ణంగా పరిశీలించాయి. అనుమానిత వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

News November 12, 2025

కరీంనగర్: లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: ఏసీబీ డీఎస్పీ

image

సమాజంలో అవినీతి పెద్ద సమస్యగా మారిందని, దాన్ని అరికట్టే శక్తి మన చేతుల్లోనే ఉందిని ఉమ్మడి కరీంనగర్‌ ACB డీఎస్‌పీ విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. లంచం అడగడం.. లంచం తీసుకోవడం.. లంచం ఇవ్వడం కూడా నేరమన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ నుంచి లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.