News March 30, 2025
NLG: 31 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయి

ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) క్రమబద్ధీకరణ 25 శాతం రాయితీ ఇచ్చినందున దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ప్రకాశ్ తెలిపారు. ఆన్లైన్లో ఫీజు చెల్లిపునకు ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉందని, అదే రోజు సెలకు సెలవు దినమైనప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొన్నారు.
Similar News
News September 15, 2025
ధర్మవరం మహిళ హత్య కేసులో భర్త అరెస్ట్

ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సాకే సరస్వతి అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో భర్త వెంకటరాముడు హత్య చేశాడని టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఆయన వివరాల మేరకు.. రెండు నెలల క్రితం సరస్వతిని ఆమె భర్త వెంకటరాముడు బంధువులతో కలిసి హత్య చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్ల పల్లి వంక పక్కన శవాన్ని పూడ్చిపెట్టారు. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు.
News September 15, 2025
ITR ఫైలింగ్ గడువు పొడిగింపు లేదు: IT శాఖ

ITR ఫైలింగ్కు గడువు పొడిగించలేదని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఐటీ విభాగం నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకోవాలని తెలిపారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఇవాళే చివరి తేదీ. ఇప్పటివరకు దాదాపు 6 కోట్లకుపైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేశారు.
News September 15, 2025
బాపట్ల ఎంపీకి 5వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ MPల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో బాపట్ల MP హరికృష్ణ ప్రసాద్ 5వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 73 ప్రశ్నలు అడిగారు. 14 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పనితీరుపై మీ కామెంట్..!