News September 2, 2024

NLG: 498 ఎకరాల్లో నీట మునిగిన పంట

image

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 4 మండలాల్లో 498ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు నీట మునిగాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. వాడపల్లిలో పత్తి 20 ఎకరాలు, వరి 100 ఎకరాలు, మాడ్గులపల్లి మండలం కాల్వపల్లిలో వరి 2 ఎకరాలు, వేములపల్లి, శెట్టిపాలెం, రావుల పెంటలో 350 ఎకరాల్లో వరి, గుర్రంపోడు మండలం రేపల్లెలో మిరప 3 ఎకరాలు, పెద్దవూరలోని చలకుర్తిలో 3 ఎకరాల్లో వరి నీట మునిగినట్లు తెలిపారు.

Similar News

News November 26, 2025

NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష

image

గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు.

News November 26, 2025

నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

image

మునుగోడు: పెట్రోల్ బంకుల్లో తనిఖీ
శాలిగౌరారం: వే2న్యూస్ కథనానికి స్పందన
పెద్దవూర: హైవేపై రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్
నల్గొండ: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షలు: మంత్రి కోమటిరెడ్డి
మిర్యాలగూడలో భారీ ర్యాలీ
నల్గొండ: సర్పంచ్ ఎన్నికల్లో వారిని దింపేందుకు ఫోకస్
నల్గొండ: పల్లెపోరుకు యంత్రాంగం రెడీ
మిర్యాలగూడ: వందే భారత్ రైలుకు అదనంగా 4 బోగీలు
కట్టంగూరు : భక్తులను ఆకట్టుకున్న మల్లన్నమర్రి

News November 26, 2025

నల్గొండ: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ ఆదేశాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఉదయాదీత్య భవన్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న నల్గొండ, చండూరు డివిజన్లకు సంబంధించిన ఆర్వోలు,( స్టేజ్- వన్ ) ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.