News October 31, 2025
NLG: 61, 511 ఎకరాల్లో పంట నష్టం

‘మొంథా’ జిల్లాలో రైతులను నిలువునా ముంచింది. వర్షం కారణంగా వరి, పత్తి, మిర్చి పంటలు, రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. 310 గ్రామాల్లో 30,359 మంది రైతులకు చెందిన 61,511 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వం 33 శాతం పైబడి పంట నష్టపోయిన వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలకు తీరని నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.
Similar News
News October 31, 2025
NLG: ఉదయం బదిలీ… మధ్యాహ్నం డిప్యూటేషన్!

నల్గొండలోని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ బదిలీల వ్యవహారం కలకలం రేపుతుంది. ఇక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగిని మరో చోటికి ఉదయం బదిలీ చేసి మధ్యాహ్నం డిప్యూటేషన్ పై మళ్లీ ఇక్కడికే తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. గంటల వ్యవధిలోనే తిరిగి సదరు ఉద్యోగికి యధాతధ పోస్టు అప్పగించడంపై తోటి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆ ఉద్యోగి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయాలని కోరుతున్నారు.
News October 31, 2025
NLG: శిశు విక్రయాలకు అడ్డుకట్టపడేదెప్పుడో!

జిల్లాలో శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, అధిక సంతానం కారణంగానే జిల్లాలో ఎక్కువగా గిరిజన తండాల్లో శిశు విక్రయ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. ఎవరికీ తెలియకుండానే పసిపిల్లల విక్రయాలు సాగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో 2020 నుంచి ఇప్పటివరకు సుమారుగా 52 శిశు విక్రయాలు జరిగినట్లు తెలుస్తుంది. శిశువిక్రయాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
News October 31, 2025
NLG: 6.7 KM పొడవునా దెబ్బతిన్న రోడ్లు

జిల్లాలో రోడ్డు భవనాల శాఖ పరిధిలోని 24 ప్రాంతాల్లో 6.7 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతినగా అందులో 15 ప్రాంతాల్లో పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటిల్లో గురువారం 7 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. వాటి తాత్కాలిక మరమ్మతులకు రూ.35 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతులకు రూ.9.70 కోట్లు అవసరమని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.


