News March 18, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో గడ్డికి గడ్డుకాలం

image

మూగజీవాలకు పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లాలో రైతులకు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. ఎండుగడ్డి కొరత తీవ్రంగా ఉండడంతో పశుపోషణ రోజురోజుకు భారంగా మారుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఎడమకాల్వ, మూసీ ప్రాజెక్టు, శాలిగౌరారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులో గతేడాది నీరు సమృద్ధిగా ఉన్న కారణంగా యాసంగిలో లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆయకట్టులో సాగు విస్తీర్ణం తగ్గింది.

Similar News

News July 6, 2025

NLG: ‘భూభారతి.. ఎలాంటి ఓటీపీలు అడగడం జరగదు’

image

భూ సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం రైతులను ఎలాంటి ఓటీపీ అడగడం జరగదని, అసలు ఓటీపీ సమస్యే రాదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. Way2News ఇవాళ ప్రచురితమైన వార్తకు కలెక్టర్ స్పందించారు. తహశీల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ వివరించారు. అందువల్ల రైతులు ఎవరు ఈ విషయాలను నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు.

News July 6, 2025

NLG: విద్యాశాఖ సతమతం.. రెగ్యులర్ ఎంఈఓలు ఎక్కడ!?

image

జిల్లా విద్యాశాఖలో సిబ్బంది కొరత వేధిస్తుంది. జిల్లాలోని అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేక ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలనే ఇన్చార్జ్ ఎంఈవోలుగా నియమించారు. దీంతో ప్రభుత్వ విద్య కుంటుపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పని ఒత్తిడితో ఇంచార్జ్ ఎంఈఓలు సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.

News July 6, 2025

NLG: రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ

image

KGBVలో ప్రత్యేక అధికారులు, PGCRTలు, CRTలు, పీఈటీలు, ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులతో పాటు అదేవిధంగా టీజీ MSGHలో ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ఈ నెల 7వ తేదీ వరకు ఫిర్యాదులు చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. 1:1 నిష్పత్తిలో సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు జాబితాను డీఈవో వెబ్సైట్లో పొందు పరిచామని తెలిపారు.